ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల నియామక(డీఎస్సీ)పరీక్షలకు చెందిన తేదీల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఇప్పటికే తేదీలను నిర్ణయించడమే ఇందుకు ముఖ్యమైన కారణంగా తెలుస్తోంది.ఈ పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ నెల, 20, 21 తేదీలలో జరగవలసిన డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా వేసి,ఆ ఎగ్జామ్స్ ని జూలై ఒకటి,రెండు తేదీల్లో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్సీ కన్వీనర్‌ M.V కృష్ణారెడ్డి శనివారం ఓ అధికారిక ప్రకటనగా వెల్లడించారు.

ఇకపోతే విశాఖపట్నం సాగర తీరంలో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్య క్రమానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. సుమారు అక్కడ ఐదు లక్షల మందితో యోగా ఆసనాలు వేయించేలా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరుగుతున్న కారణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆ పనుల్లో నిమగ్నమై ఉండటం ఒక కారణమైతే అదే సమయంలో రవాణా సౌకర్యం కూడా పరిమితం గా అందుబాటులో ఉంటాయని అధికారులు ఆలోచన చేశారు.ఇలాంటి పరిస్థితు వల్ల పరీక్షలు నిర్వహిస్తే ఆ పరీక్షలు రాసే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ వాయిదా నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి