ఏ.ఎన్.యూ,గ్రంధాలయానికి విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్:గోనుగుంట్ల.

నాగార్జున నగర్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నెలకొని ఉన్న డా.బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీని మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సందర్శించారు.ఈ సందర్భంగా స్థానిక గ్రంథాలయ అధికారి డాక్టర్ కోడెల వెంకటరావు గ్రంధాలయంలోని ఉన్న మొత్తం గ్రంధాల సంఖ్య మరియు వార్షిక ఆర్థిక బడ్జెట్ అలాగే గ్రంథాల యంలో విద్యార్థులకు అందిస్తున్నటువంటి సేవల ను అడిగి తెలుసుకున్నారు.గ్రంథాలయ సిబ్బంది కి,అక్కడ విద్యార్థులకు అవసరం ఉన్న సదుపాయాలపై వారిని అడిగి మరీ ఆరా తీశారు.

వర్సిటీ గ్రంథాలయంలో ఉన్నటువంటి పోటీ పరీక్షల విభాగాన్ని కూడా సందర్శించిన ఆయన అక్కడున్న విద్యార్థులతో చర్చించి వారికి అందిస్తున్న సేవలు, వారికి కావాల్సిన మరిన్ని పోటీ పరీక్షలకు అవసరం ఉన్న పుస్తకాలు,ఇతర మెటీరియల్ వంటి వాటిపై కూడా ఆరా తీశారు.వారికి కావలసిన మెరుగైన సేవలు అందించుటకు ఆయన వారితో మాట్లాడటం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం, చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రంధాలయాల అభివృద్ధికి ఎంతో అంకిత భావంతో నిధులు మంజూరు చేస్తున్నారని, విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోను గుంట్ల కోటేశ్వరరావు అన్నారు.తనకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ విద్యాసంస్థల నిర్వాహకులు వై.వెంకట్రామయ్య, టిడిపి రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి పి శ్రీనివాసరావు, వర్సిటీ గ్రంథాలయాధికారి కోడెల వెంకట రావు,సి.ఎస్.ఆర్,సీనియ ర్ ప్రోగ్రాం ఆఫీసర్ మండూరు వెంకటరమణ మరియు స్థానిక గ్రంథాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి