మగబిడ్డ కోసం దారుణం.. రెండుసార్లు అబార్షన్.. మామ, బావతో సంబంధం పెట్టుకోవాలని భార్యపై భర్త ఒత్తిడి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మగబిడ్డ పుట్టాలనే మోజుతో భార్యపై భర్త, అత్తింటివారు అమానుష వేధింపులు చేశారు. రెండు సార్లు అబార్షన్ చేయించడంతో పాటు మామ, బావతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశారు.

మహారాష్ట్రలో దారుణం: మహిళా వైద్యురాలిపై ఎస్సై నాలుగుసార్లు అత్యాచారం – ఆత్మహత్యతో సంచలనం

మహారాష్ట్ర సతరా జిల్లాలో మహిళా వైద్యురాలిపై ఎస్సై గోపాల్ బడ్నే నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సీఎం ఫడ్నవీస్ ఆదేశాలపై ఎస్సై సస్పెండ్ అయ్యాడు.

48 ఏళ్ల తర్వాత ప్రేమ నేరం వెలుగులోకి – 81 ఏళ్ల తాత అరెస్ట్‌

ముంబైలో 1977లో తన ప్రేయసిని కత్తితో పొడిచిన కేసులో 48 ఏళ్ల తర్వాత 81 ఏళ్ల చంద్రశేఖర్‌ మధుకర్‌ కాలేకర్‌ పట్టుబడ్డాడు. న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు.

తెలంగాణ ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు — లెక్కల్లో లేని రూ. 4.18 లక్షల నగదు స్వాధీనం

తెలంగాణలో ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లు చేస్తున్న అధికారుల వద్ద రూ. 4.18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ ప్రభుత్వం కు నివేదిక సమర్పించింది.

డేటింగ్ యాప్ వలలో 6.49 లక్షలు కోల్పోయిన మలక్‌పేట యువకుడు – సైబర్ మోసం మరోసారి బహిర్గతం

హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన యువకుడు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి వలలో చిక్కి రూ.6.49 లక్షలు కోల్పోయాడు. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, హోటల్ బుకింగ్ పేర్లతో మోసగాళ్లు డబ్బులు దోచుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పెళ్లిళ్ల పేరుతో పెద్ద దోపిడీ — అలీఘర్‌లో 12 ఇళ్లను ఊడ్చేసిన వధువులు!

ఉత్తర ప్రదేశ్‌లో అలీఘర్‌లో కర్వాచౌత్ రోజు 12 వధువులు తమ భర్తలకు మత్తుమందు ఇచ్చి నగలు, డబ్బుతో పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ మోసం వెనుక ఉన్న బ్రోకర్ల ముఠాను పోలీసులు వెతుకుతున్నారు.

‘పాత మొబైల్‌ ఫోన్లు ఇస్తే ప్లాస్టిక్‌ సామాన్లు’ — వెనుక ఉన్న సైబర్‌ ముఠా రహస్యాలు బయటపడ్డాయి!

‘పాత మొబైల్‌కి ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తాం’ అంటూ ప్రజలను మోసగిస్తున్న బీహార్‌ గ్యాంగ్‌ పట్టుబడింది. దుమ్ముగూడెం పోలీసులు 150 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

శబరిమల ఆలయంలో బంగారం మాయం – హైకోర్టు దర్యాప్తు ఆదేశాలు, దేవస్థానం బోర్డు ఇబ్బందుల్లో

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో 4.54 కిలోల బంగారం మాయమైంది. హైకోర్టు విస్తృత దర్యాప్తు ఆదేశించింది. బోర్డు, సిపిఎం ప్రభుత్వంపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు.

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన – చితిలో బంగారం కోసం దొంగతనం, కపాలం ఎత్తుకెళ్లిన దుండగులు

మహారాష్ట్ర జల్‌గావ్‌లో వృద్ధురాలి చితిలో బంగారం కోసం దొంగలు పడ్డారు. బూడిద గాలించి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. పోలీసులు విచారణలో ఉన్నారు.

ప్రేమికుల ఆత్మహత్య: పట్టాభిపురం లో రైల్వే ట్రాక్ ఘటనలో యువ జంట తీవ్ర మనోవేదనకు గురి

పట్టాభిపురం ప్రాంతంలో ప్రేమలో ఉన్న గోపి, లక్ష్మీ ప్రియాంక పెద్దల నిరాకరణతో తీవ్ర నిరాశకు గురై వేర్వేరు రోజుల్లో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.