బన్నీ-అట్లీ మూవీ శరవేగంగా మొదలుకానుంది: ముంబయిలో భారీ యాక్షన్ షెడ్యూల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో విజయవంతంగా ముందుకెళ్తున్న తరుణంలో, ఆయన తదుపరి చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశ ముగింపుకు చేరింది.

తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ముంబయిలో ప్రారంభంకానుంది. ఇది మూడు నెలలపాటు సాగనుండగా, ఇందులో అల్లు అర్జున్ కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారు. అనంతరం వీఎఫ్ఎక్స్ పనుల నిమిత్తం సినిమా యూనిట్ అమెరికా వెళ్లనుందని సమాచారం.

ఈ చిత్రం పునర్జన్మ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌లతో ముడిపడి ఉండగా, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు హాలీవుడ్ టెక్నీషియన్లు రంగంలోకి దిగనున్నారు. ‘అవతార్’ వంటి సినిమాలకు పనిచేసిన గ్రాఫిక్ ఆర్టిస్టులతో లాస్ ఏంజెల్స్‌లో అట్లీ ఇప్పటికే చర్చలు జరిపారు.

ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత ఏమిటంటే, బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. యోధురాలుగా ఆమె పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారనుందని చిత్ర వర్గాల సమాచారం. ఇటీవల ఆమె “రోజుకి 8 గంటలే పని చేస్తాను” అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా, అదే వ్యాఖ్యలతో ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ నుంచి తప్పించబడ్డారని వార్తలు వచ్చాయి. అంతేకాదు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా దీపికపై విమర్శలు చేశారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక అల్లు అర్జున్ లుక్ రివీల్ చేయనున్నారని సమాచారం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి