మాజీ మంత్రి పేర్ని నాని’పై బుద్దా వెంకన్న ఫైర్.

విజయవాడ:వల్లభనేని వంశీ స్వాతం త్ర్య సమర యోధుడు అన్నట్లుగా పేర్ని నానీ తెగ బిల్డప్ ఇస్తున్నా డని టిడిపి నేత బుద్దా వెంకన్న అన్నారు.పేర్నీ నానీ నీకు అస్సలు సిగ్గు ఉందా…అంటూ నీ బియ్యం కుంభ కోణం గురించిచెప్పు,తప్పు డు పనులు చేసింది కాకుం డా.. నీ భార్య పేరు పెడతా వా,చంద్రబాబుకు ధన్య వాదాలు చెప్పిన నువ్వు.. ఇప్పుడు విశ్వాస ఘాతకు డిగా మాట్లాడతావా అని అన్నారు.బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర నీది.అతని హత్యా రాజకీయాలు చేసే వ్యక్తా.. నీకు తెలియదా,అటువం టి సౌమ్యుడిని 55రోజుల పాటు జైల్లో పెట్టించావు. రవీంద్ర మామయ్య నడ కుదిటి నరసింహారావు మానసికంగా కుంగిపోయి చనిపోయేలా చేశావు. అలాగే వంగవీటి మోహన రంగా పేద ప్రజల కోసం పాటు పడిన మహనీయు డు,అటువంటి గొప్ప వ్యక్తి తో వంశీకి పోలికా.. నానీ నీ బుర్ర పని చేస్తుందా అని బుద్దా వెంకన్న పేర్ని నాని, ని పలురకాలుగా ప్రశ్నించా రు.

పేదవాళ్లను అడ్డం పెట్టు కుని వంశీ డబ్బులు కొట్టేసి న వ్యక్తి అని,నానీ నువ్వు మోకాళ్ల మీద కూర్చుని రంగా అభిమానులు ఆయ న కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.నీ కులం వారిని నువ్వే కించ పరిస్తే,జగన్ దగ్గర మార్కు లు కొట్టేయవచ్చని చూస్తు న్నావు.గతంలో పవన్ కళ్యాణ్ పైనా ఇలాగే నోరు పారేసుకున్నావు.ఇఫ్పుడు వంశీ వంటి నీచుడిని రంగా గారితో పోలిస్తే..నీ కులం వాళ్లే నిన్ను చెప్పులతోకొడ తారని ఆరోపించారు.అస లు ముందు నీ బియ్యం కుంభకోణం గురించి మాట్లాడు,నువ్వు కేసులో ఇర్కుకోకూడదని,నీ భార్య పేరు పెట్టి ఆమెను అన్యా యంగా ఇరికించావు.వంశీ, కొడాలి నానీలు చంద్రబా బు కుటుంబాన్ని ఎలా తిట్టారో నీకు తెలియదా అని అడిగారు వారి బూతుల వల్లే వైసీపీ ఓడి పోయిందని మీ వాళ్లే చెబు తున్నారన్నారు.నీవు సిగ్గు లేకుండా ఇంకా ఎలా మాట్లాడుతున్నావు అన్నారు.

వంశీ వాంతులు ఎక్కడ చేసుకున్నాడు,నువ్వు చూశావా…పోలీసులను, అధికారులను,వైద్యులను నీఇష్టం వచ్చినట్లు మాట్లా డతావా…నువ్వు వాళ్లకు జీతాలు ఇస్తున్నావా,నీ కింద పనివాళ్లా అని ఆవే శం వ్యక్తం చేశారు.అవాస్త వాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవడమే మీ వైసీపీ నాయకుల చరిత్ర. చంద్ర బాబు,కొల్లు రవీంద్ర,అచ్చెం నాయుడులు,జనార్ధన్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారు.వంశీని అక్రమ అరెస్టు అని ఎవరైనా చెప్పగలా అని ప్రశ్నించారు.ఆయన పిల్ల లు కూడా వచ్చి చూడటం లేదు.కుటుంబ సభ్యులు కూడా ఛీ కొట్టే నైజం వంశీ ది అని బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. మేము లెగిస్తే మంచోళ్లం కాదు అంటూ కబుర్లు చెప్పడం కట్టి పెట్టండి.

1995 లోనే సీఎంగా చంద్ర బాబు రాష్ట్రంలో ఫ్యాక్షని జాన్ని ఆపారు.వంశీ,కొడా లి నానీలు మాటలు, బూతులు చూస్తే.. ఫ్యాక్ష నిస్టులు కూడా చీదరించు కుంటారని మాట్లాడారు. వంశీకి ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందా.. రా…చూద్దాం అనేశారు.
వంశీ అందగాడు అని మీ జగనే చెప్పాడు కదా. మేకప్ వేస్తే ప్రతివాడు అందగాడే,జైల్లో ఇవన్నీ కుదరవు కదా.అసలు రూపం ఇప్పుడు బయట పడింది.వంశీది వికృత రూపం అని సోషల్ మీడి యాలో ప్రజలే పోస్టులు పెడుతున్నారని ఆయన అన్నారు.మరి ఇలాంటి వాడు జగన్ కు ఎలా నచ్చాడో ఆయనకే తెలి యాలి.పేర్ని నానీ నువ్వే పెద్ద బియ్యం దొంగవి.. మిగతా దొంగలను కూడా వెనుకేసుకు వస్తున్నావు
మీ కొడాలి నానీ ఎక్కడ ఉన్నాడు…ఆడు ఈడు అని రంకెలేసిన వాడు.. ఇప్పుడు పారిపోయాడా..?
మేము దమ్ముగా,దైర్యంగా మీ అరాచకాలను ఎదుర్కొ న్నాం అని,కొడాలి నానీ ఇప్పుడు ఎందుకు బయట కు రావడంలేదని,అతని అరాచకాలకు అరెస్టు అవుతాననే భయం పట్టు కుందనుకుంటా…కొడాలి నాని అవినీతి దేహం కుళ్లి పోయింది.అందుకే ఏపీలో వైద్యం చేయడం కుదర లేదు.అందుకే ముంబై వెళ్లి .. వైద్యం చేయించుకు న్నాడు.

భార్య ను ఎవడైనా కేసు లో ఇరికిస్తాడా బుద్ది ఉందా పేర్ని నానీ నీకు. నిజంగా జబ్బు ఉంటే,ప్రభు త్వ ఆసుపత్రి వైద్యులే చికిత్స చేస్తారు.నువ్వు వైద్యులకు సూచనలు చేస్తావా.నీకు అసలు ఏం తెలుసు.అబద్దాలను అందంగా వల్లిస్తూ సూక్తు లు చెప్పడమా…వైద్యం అంటే,పేర్ని నానీ..నీకు దమ్ముంటే..నువ్వు బొక్కే సిన బియ్యంపై చర్చకురా,

ఎక్కడైనా…సరే చర్చించేం దుకు మేము సిద్దంగా ఉన్నాం అని బుద్దా సవా లు విసిరారు.వంశీకి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చా యో చెప్పాండి.ఎక్కడ భూములు కొన్నాడు, అమ్మాడో నిరూపించండి.
వంశీ ఇళ్ల పట్టాల కోసం పేద ప్రజల దగ్గర డబ్బులు దొబ్బెశాడని ఆరోపించారు.
అవినీతి పరుడైన వంశీని ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన రంగాతో పోల్చ డానికి నీకు సిగ్గు శరం ఉందా పేర్ని నానీ,రంగా గారిని చంపినవారు నీ పార్టీలో ఎంతమంది ఉన్నా రో నీకు తెలియదా.నువ్వు రంగాగారి పేరు ఎత్తినందు కు,పోల్చినందుకు ఆయన కుమారుడికి,మోకాళ్లపై కూర్చుని అభిమానులకు క్షమాపణ చెప్పాల్సిందే.
వైద్య సిబ్బంది,వైద్యులను అవమానించినందుకు వారికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి