అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్ర*మాద ఘటనతో ఎయిర్ ఇండియా సంస్థ లోపాలు బయటపడుతూనే ఉన్నాయి.దీనితో మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ముంబై నుండి బ్యాంకాక్ వెళ్లే ఓ ఎయిరిండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు పెట్టింది. అయితే ఇది గమనించిన ఓ ప్రయాణికుడు ఫోటో తీసి ఆ విమానం యొక్క ఎయిర్ హోస్టెస్కు చూపించడం జరిగింది. వెంటనే ఎయిర్ హోస్టెస్ ఆ విమానం పైలట్కి చూపించడంతో ఆ ఫైలెట్ వెంటనే గ్రౌండ్ స్టాఫ్కు కాల్ చేయగా, అక్కడ ఉన్న సెక్యూరిటీతో పాటు గ్రౌండ్ స్టాఫ్ ఉన్నపళంగా విమానం వద్దకు చేరుకున్నారు.పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను,గడ్డి,పీచులను సిబ్బంది తొలగించారు. దీంతో విమానం 3 గంటలు ఆలస్యంగా అక్కడ నుండి బయలుదేరింది.
కాగా వరుస విమాన ప్రమాద ఘటనలు కలవరపెడుతున్న నేపథ్యంలో విమానాలు ఎక్కేందుకు విమాన ప్రయా ణీకులు ఆందోళనకు గురవుచున్నారనేది దీనిని బట్టి అర్ధమవుతుంది. ఎయిర్ ఇండియాకి లేని జాగ్రత్త,ఆ విమానంలో ప్రయాణించే ప్రయాణీకులు సైతం వారు ఎక్కిన విమానం ఏ కండీషన్ లో ఉంది అని,ఒళ్ళంతా కళ్ళు చేసుకుని పరిశీలిస్తున్నట్లు ఉన్నారు.ఎయిర్ ఇండియా తమ విమానాల పర్యవేక్షణ లోపాలు ఇంతలా ఉన్నాయా అనిపిస్తుంది.లేదంటే విమానం రెక్కల మాటున పక్షి పెట్టిన గూడు ఆ విమాన ప్రయాణీకుడు కనిపెట్టగలిగి ఉంటాడు.