అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మ వారధి నుండి,నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోకి ప్రవేశించేందుకు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు అవసరం ఉంది.అలాగే అమరావతిలో నుండి వారధి మీదుగా విజయవాడలోకి వెళ్లేందుకు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రధానమైనది.2015లో భూ సమీకరణ నాటి నుండి సీడ్ యాక్సిస్ రోడ్డు మార్గంలో భూ సమీకరణకు రైతులు కొందరు ఆశక్తి చూపలేదు. ప్రధానంగా ఉండవల్లి వద్ద కొండవీటివాగు సమీపంలో భూములున్న రైతుల నుండి కొంత వ్యతిరేకత వచ్చింది.అయితే ఇప్పుడు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు కొంతమేర మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తుంది.
ఇప్పటివరకు తుళ్ళూరు మండలం దొండపాడు నుండి వెంకటపాలెం రెవెన్యూ పరిధిలో గల మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు రోడ్డు విస్తరణ జరిగి ఉంది.గతంలో రైతులు భూములు ఇవ్వకపోవడం తో అక్కడ నుండి నిలిచిపోయిన సీడ్ యాక్సెస్ రహదారికి,ప్రధానంగా ఇప్పుడు పెనుమాక,కొద్ది మంది ఉండవల్లి రైతులు పూలింగ్ కి భూములు ఇవ్వడంతో ఇటీవల వారికి సైతం ప్లాట్స్ కేటాయించింది ప్రభుత్వం.దీనితో 49వ ఆధారిటీ సమావేశములో రోడ్డు విస్తరణకు620 కోట్లు కేటాయించారు.ఈ నిధుల తో సీతానగరం ప్రకాశం బ్యారేజి సమీపంలో గల పి.డబ్ల్యూ.డి,వర్కుషాప్ నుండి నేరుగా వారధి వద్ద గల మణిపాల్ హాస్పిటల్ వరకు ఒక ఫ్లై ఓవర్ నిర్మాణం చేయనున్నారు. అటు తాడేపల్లి జాతీయ రహదారి వద్ద ట్రంపేట్ జంక్షన్ నిర్మాణం చేయనున్నారని సమాచారం.ఇకపోతే ఉండవల్లికి చెందిన రైతులతో మంత్రి నారా లోకేష్ ఓ సమావేశంలో చర్చించాల్సిఉంది.ఈ సమావేశంలో రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారనేది మంత్రి లోకేష్ వద్ద క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది.ఇది జరిగితే సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికిపూర్తి స్థాయి మోక్షం కలిగినట్లేన ని తెలుస్తుంది.