ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ‘గోకులం షెడ్ల పథకాన్ని’ మరింత విస్తరించింది. పశుపోషకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం కింద 90% వరుకు రాయితీతో పశువుల షెడ్లు, అలాగే జీవాలు, మేకలు, కోళ్ల పెంపకందారులకు 70% వరకు రాయితీతో షెడ్లు మంజూరు చేస్తోంది. ఒక్కో షెడ్డుకు రూ.1.15 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు కేటాయింపులు జరుగుతున్నాయి.
ఈ పథకం ద్వారా రైతులు తమ పశువులను సురక్షితంగా సంరక్షించుకోవడంతో పాటు, ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. గతేడాది మొదటి విడతలో వేలాది షెడ్లు నిర్మించబడగా, రెండో విడత నిర్మాణాలకు కూడా అనుమతులు లభించాయి. అవసరమైన నిధులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.
గోకులం షెడ్ల రాయితీ – ముఖ్యాంశాలు
- పశుపోషకులకు 90% రాయితీ
- గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందారులకు 70% రాయితీ
- షెడ్డుల ఖర్చు: రూ.1.15 లక్షలు – రూ.2.30 లక్షలు
- రైతులు చెల్లించాల్సింది కేవలం 10% వాటా మాత్రమే
- రెండో విడత షెడ్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది
- పూర్తయిన పనుల బకాయిలు కూడా విడుదల కానున్నాయి
విభిన్న షెడ్లకు ఖర్చులు
పశువుల షెడ్లు (90% రాయితీ)
- 2 పశువుల షెడ్ – రూ.1.15 లక్షలు
- 4 పశువుల షెడ్ – రూ.1.85 లక్షలు
- 6 పశువుల షెడ్ – రూ.2.30 లక్షలు
→ రైతు వాటా: 10% మాత్రమే
గొర్రెలు, మేకలు (70% రాయితీ)
- 20 యూనిట్లు – రూ.1.30 లక్షలు
- 50 యూనిట్లు – రూ.2.30 లక్షలు
కోళ్ల షెడ్లు (70% రాయితీ)
- 100 యూనిట్లు – రూ.87,000
- 200 యూనిట్లు – రూ.1.32 లక్షలు
→ రైతు వాటా: 10% మాత్రమే
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
గోకులం షెడ్లకు దరఖాస్తు చేయాలనుకునే రైతులు తమ పత్రాలతో కలిసి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
అవసరమైన పత్రాలు:
- పట్టాదారు పాసుపుస్తకం
- ఆధార్ కార్డు
- ఉపాధి హామీ (జాబ్ కార్డు)
ఈ పథకం ద్వారా రైతులు తమ పశువులు, కోళ్ల పెంపకానికి సురక్షితమైన, శాస్త్రీయమైన షెడ్లు నిర్మించుకోవచ్చు. అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



