ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది మేలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. గంగాధరరావు
రిజిస్టార్ ఆచార్య జి. సింహాచలం లు గురువారం విడుదల చేశారు.
బి ఎ, బీకాం, బిబిఎ ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 6220 మంది విద్యార్థులు హాజరు కాగా 6143 మంది ఉత్తీర్ణ సాధించారు. దూరవిద్య కేంద్రం పరిధిలో సెమిస్టర్ విధానం ప్రారంభమైన తర్వాత తొలి ఫలితాలుగా ఉన్నాయని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు. పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ లు తెలిపారు.
ఫలితాల విడుదల కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టర్ సయ్యద్ జైలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణవేణి, సూపర్డెంట్ జె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.