ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి ఆయన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం.
ఈ బడ్జెట్ మొత్తం రూ. 3,32,205 కోట్లుగా ఉండగా,
- రెవెన్యూ వ్యయం: రూ. 2,56,143 కోట్లు
- మూలధన వ్యయం: రూ. 53,915 కోట్లు
- రెవెన్యూ లోటు: రూ. 22,002 కోట్లు
- ద్రవ్య లోటు: రూ. 75,868 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు:
- పాఠశాల విద్య – రూ. 32,308 కోట్లు
- బీసీ సంక్షేమం – రూ. 23,650 కోట్లు
- పంచాయతీ రాజ్ – రూ. 22,941 కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖ – రూ. 19,306 కోట్లు
- జలవనరుల శాఖ – రూ. 18,223 కోట్లు
- మున్సిపల్ శాఖ – రూ. 14,538 కోట్లు
- ఇంధన శాఖ – రూ. 13,934 కోట్లు
- వ్యవసాయ శాఖ – రూ. 11,118 కోట్లు
- సాంఘిక సంక్షేమ శాఖ – రూ. 11,118 కోట్లు
- ఈడబ్ల్యూఎస్ సంక్షేమం – రూ. 10,699 కోట్లు
- తల్లికి వందనం – రూ. 9,668 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం – రూ. 4,581 కోట్లు
- స్కాలర్షిప్స్ – రూ. 3,836 కోట్లు
- సమగ్ర శిక్షణ – రూ. 2,946 కోట్లు
- ఉన్నత విద్యాశాఖ – రూ. 2,566 కోట్లు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ. 2,161 కోట్లు
- మనబడి – మన భవిష్యత్తు – రూ. 1,500 కోట్లు
- స్కిల్ డెవలప్మెంట్ – రూ. 1,232 కోట్లు
- పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ. 707 కోట్లు
- సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర – రూ. 654 కోట్లు
- యువత & క్రీడలు – రూ. 438 కోట్లు
ప్రత్యేక కేటాయింపులు:
- అమరావతి అభివృద్ధికి – రూ. 6,000 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులకు – రూ. 9,906 కోట్లు
- అన్నదాత సుఖీభవ – రూ. 6,600 కోట్లు
- పోలవరం ప్రాజెక్టు – రూ. 6,105 కోట్లు
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ. 1,927 కోట్లు
- మత్స్యకార సేవ – రూ. 260 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు
- పంటల బీమా – రూ. 250 కోట్లు
- పీఎం కృషి సించాయి యోజన – రూ. 190 కోట్లు
- పర్యావరణం, అటవీ & విజ్ఞానశాస్త్రం – రూ. 714 కోట్లు
- పట్టణాభివృద్ధి శాఖ – రూ. 14,539 కోట్లు



