వన్డే చరిత్రను మార్చిన మ్యాచ్: రెండు జట్లు 400 పైగా స్కోర్ చేసిన ఘట్టం

historic-434-vs-438-odi-match-southafrica-vs-australia

ఒక‌ప్పుడు వన్డే క్రికెట్‌లో 300 పరుగులు చేయడమే అరుదైన ఘ‌ట‌న‌గా భావించబడింది. కానీ కాలం మారింది. 400 పరుగుల మార్క్ సాధించిన తర్వాత, ఇప్పుడు ఒకే ఇన్నింగ్స్‌లో 500 పరుగుల యుగానికి చేరుకుంటున్న దశలో క్రికెట్ నిలుచుంది. అట్టి ఆధునిక పరుగుల సంచలనానికి నాంది పలికిన మ్యాచ్‌ మాత్రం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది – అదే 2006లో జరిగిన ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా వన్డే.

జోహన్నెస్‌బర్గ్ వేదికగా మార్చి 12, 2006న జరిగిన ఆ మ్యాచ్ వన్డే క్రికెట్ నిర్వచనాన్నే మార్చేసింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగింది. గిల్‌క్రిస్ట్ (55) – కాటిచ్ (79) ఆరంభం ఇచ్చి, ఆ తర్వాత రికీ పాంటింగ్ చెలరేగిపోయాడు. అతను కేవలం 105 బంతుల్లో 164 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ వన్డే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మైకెల్ హసీ (81) దూకుడుగా ఆడడంతో ఆసీస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 434 పరుగులు చేసింది. అప్పటివరకు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోర్.

ఈ భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేజ్ చేయగలదని ఎవ్వరూ ఊహించలేదు. కానీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (90) – హెర్షల్ గిబ్స్ (175) విజృంభించడంతో మ్యాచ్ రొమాంచకంగా మారింది. గిబ్స్ వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరుతో రాణించాడు. చివరి ఓవర్‌కు 7 పరుగులు అవసరమవగా, మార్క్ బౌచర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఐదవ బంతికి ఫోర్ కొట్టి దక్షిణాఫ్రికా విజయానికి ముద్ర వేసింది.

ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి మొత్తం 872 పరుగులు చేశారు. ఇందులో 87 ఫోర్లు, 26 సిక్సర్లు నమోదయ్యాయి. ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 504 పరుగులు వచ్చాయి. ఒకే వన్డేలో రెండు జట్లు 400 పైగా స్కోర్ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికీ ఇది అత్యధిక జమ అయిన వన్డే మ్యాచ్లలో అగ్రస్థానంలో ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి