గుంటూరు: సగటు మనిషిగా ఈ సమాజంలో పేదలు బ్రతికేందుకు జీవితాలు భారంగా మారిపోయాయి పరిస్థితులు.ఈ నేపథ్యంలో గుంటూరులో ఓ బాలుడి దీనగాధ సామాజిక చైతన్యం కలిగించేలా సమాజాన్ని,ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఆ 8ఏళ్ళ బాలుడు గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు.తన కుటుంబ పరిస్థితి చెప్పి,నగరంలో గల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి నడిపేందుకు తన తల్లికి అవకాశం కల్పించాలని, తన తండ్రి, అమ్మను వదిలివేశాడని కలెక్టర్ ని కలిసేందుకు వచ్చాడు.ఈ లోగా అతనిని గమనించిన స్థానిక మీడియా ప్రతినిధులు బాలుడిని పలకరించగా బాలుడు మీడియాకు వివరించిన విషయం ఇది.
తన తల్లికి గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి ఉండేదని,దానిని వేరేవారు తొలగించి, మా అమ్మను అక్కడ టిఫిన్ బండి పెట్టనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వినతిపత్రం కలెక్టర్ కి అందించి తమ సమస్యను వివరించేందుకు వచ్చాడు. తనకు ఆరోగ్యం సరిగాలేదని తనకోసం అమ్మ అక్కడ టిఫిన్ బండి పెట్టుకుని తనని చూసుకుంటున్నట్లు బాలుడు తెలిపాడు. అధికారులు స్పందించి తనతల్లికి టిఫిన్ బండి నడుపుకునేందుకు అక్కడ అవకాశం కల్పించాలని మీడియా ముఖంగా తన ఆవేదన,పరిస్థితి అధికారులకు విన్నవించాడు.