నటి మనీషా కొయిరాలా ఆవేదన అంతా-ఇంతా కాదు, కొందరిని నమ్మి ఒంటరై పోయిందట…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేపాల్ బ్యూటీ నటి మనీషా కొయిరాలా గురించి చెప్పాలి అంటే 1990వ దశకంలో బాలీవుడ్ వెండితెరను ఆమె ఏలేసింది.ఆనాటి యువకుల కలల రాణిగా పేరు గాంచింది.అయితే ఆమె గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి జీవితం గడుపుతుంది. ఆమెకు ప్రస్తుతం 54 సంవత్సరాలు.ఈ వయస్సులో కూడా,ఈ నటి నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. అప్పట్లో 12 మంది సెలబ్రిటీలైన పలువురితో ప్రేమ పరిచయాలు,ఇతర సంబంధాలు ఉన్నాయని ఆమె పెళ్ళి చేసుకున్న రెండేళ్లలోనే విడాకులు తీసుకున్నట్లు పుకార్లు షికారు చేశాయి.వాస్తవం ఉందో… లేదో….గానీ మనీషా కొయిరాలా మాత్రం ‘నేను తప్పుడు వ్యక్తులను నమ్ముతూనే ఉన్నాను.’ “నా జీవితంలో ఒక పురుషుడి నుండి ఎటువంటి ప్రేమ లేదు…” అని మనీషా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడింది.ఇది మనీషా బ్యూటీ గురించి చెప్పాలంటే…ఇప్పటి యువకులకు ఈ పరిచయం సరిపోతుంది ఆమె గురించి చెప్పాల్సి వస్తే, అప్పట్లో నాగార్జునతో క్రిమినల్ చిత్రంలో కూడా ఆమె నటించింది.

ఇకపోతే ఈమె తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేసింది. మనీషా కోయిరాల అప్పట్లో హీరోయిన్ గా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాల్లో నటించింది.ఆమె కెరీయర్ ఆరంభంలో ఆమె సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.అయితే ఆమెకు స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సాధించి పెట్టింది దక్షిణాది చిత్రాలే. అలాంటిది ఇప్పుడు మనీషా కోయిరాల సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై పోయింది.ఇలా జరగడానికి కారణం మాత్రం అప్పట్లో తలైవా రజనీకాంత్ సరసన నటించిన ‘బాబా’ అనే సినిమా అని ఓ సందర్భం లో మాట్లాడింది.అయితే ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా అవుతున్నాయి. బాబా చిత్రం ఫ్లాఫ్ అయ్యిందని,దాని కారణంగా తాను చాలా నష్టపోయినట్లు చెప్పింది. ఆ సినిమా డిజాస్టర్ అనంతరం దక్షిణాదిలో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయని,ఆ సినిమాకి ముందు సినిమా అవకాశాలు బాగా వచ్చేవి అని మనీషా ఆవేదన వ్యక్తం చేసింది.పాపం ఇప్పుడు ఆమెకు సినిమాలు లేక,జీవితంలో ప్రేమను పంచిపెట్టే భర్త రాక, ఏ మగాడిని నమ్మే పరిస్థితి లేక ఇలా జీవితం ఒంటరితనమైపోయింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి