తాడేపల్లి;అమరావతి మహిళలపై నీచమైన వాఖ్యలు చేసిన వ్యక్తులపై అక్కడి మహిళలు పెట్టిన కేసులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఒకొక్కరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.ఏ1గా, జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఏ2గా,అరెస్ట్ కాగా ఆయన రిమాండ్ లో ఉన్నారు.ఇక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావులు అరెస్ట్ అయ్యి 14రోజుల రిమాండ్ అనంతరం బయటికి రావడం జరిగింది.ఇక వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా ఈ విషయంలో కేసు నమోదు అయ్యింది. అమరావతి మహిళలను కించపరిచే విధంగా సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారని అమరావతి దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష సజ్జల వాఖ్యలపై పిర్యాదు చేశారు.తాడేపల్లిలో పోలీసులు మాట్లాడుతూ పిర్యాదు ఆధారంగా 79, 352, 353(2),196(1) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు మాట్లాడారు.
YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి PS లో కే-సు నమోదు.
