నారా లోకేష్‌కు అపూర్వ విజ్ఞత… జ‌గ‌న్‌తో భిన్నంగా ప్రజల్లో ఆదరణ పొందుతున్న యువ నేత

nara-lokesh-vijnatha-public-support-vs-jagan-leadership

రాజకీయాల్లో అనుభవం ఎంత ఉన్నా, ఎన్ని ఎన్నికల్లో విజయం సాధించినా, నేతల వ్యక్తిత్వాన్ని నిర్ధారించే అంశాల్లో విజ్ఞత ప్రధానంగా ఉండాలి. ఇది పాఠశాలలలో నేర్పేది కాదు. అది వ్యక్తిగతంగా అలవడాల్సిన లక్షణం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ విషయానికి వస్తే—ఎంపీగా, ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందిన అనుభవం, కుటుంబ వారసత్వం ఘనంగా ఉన్నా—అయితే ఆయనలో విజ్ఞత, వినయం కొరవడిన అంశాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్లే జగన్ ప్రజల్లో పాపులారిటీ రోజురోజుకీ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది.

ఇదే సమయంలో, తొలిసారి ప్రజల్లో విజయాన్ని పొందినప్పటికీ, మంత్రి నారా లోకేష్ తాను ప్రదర్శిస్తున్న విజ్ఞతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారసత్వం నుంచి రాజకీయాల్లోకి వచ్చినా, లోకేష్ తన వ్యక్తిగత శైలి, మానవ సంబంధాల నైపుణ్యం, రాజకీయం నిర్వహించే తీరు ఆయనను జగన్ కంటే మెరుగైన స్థాయికి తీసుకెళ్లాయి.

అధికారంలో ఉన్నా గర్వంతో వ్యవహరించకూడదని నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఇటీవల కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన మంత్రి, స్థానిక టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి కోసం కృషి చేయాలని సూచించారు.

ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలన్నదే ఆయన పిలుపు. ఎవరికి తోచినట్లు కాకుండా, ప్రజలు మెచ్చే విధంగా ప్రభుత్వాన్ని నడిపించాలని స్పష్టం చేశారు. విజయం సాధించిన తర్వాత మిగతా అంశాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రజల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని హితవు పలికారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి