ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీరుపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం.

అమరావతి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలు ఫీజు చెల్లించలేదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్ష ఫలితాలను నిలిపివేయడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది.కాలేజీలు ఫీజు చెల్లించకుంటే అందుకు విద్యార్థులు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని హైకోర్టు ప్రశ్నించింది. ఫీజులు చెల్లించని కాలేజీల పట్ల చర్యలు తీసుకోవాలి గానీ ఇదేమిటి అంటూ హైకోర్టు అడిగింది.దానికి మేము ఎంత మాత్రం జోక్యం చేసుకోం, కానీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోం అని, మాకు విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే ముఖ్యం అంటూ ఇంతకు మించి మాకు ఏది ముఖ్యం కాదు.
ఫలితాలు వెల్లడించకుంటే అది విద్యార్థుల జీవితాల పై తీవ్ర ప్రభావం చూపు తుంది అన్నారు.ఫీజులు చెల్లించకపోతే ఆ కాలేజీలు పైన చర్యలు తీసుకోండి, అంతేతప్ప పరీక్షా ఫలితాలను వెల్లడించకుండా ఆపేస్తామంటే అంగీకరించే ప్రసక్తి లేదని,పూర్తి వివరాలతో అఫీడివెట్ దాఖలు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి