భారత్‌ కూడా అమెరికాకు రుణదాతే.. అప్పుల ఊబిలో అగ్రరాజ్యం

అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికే ఆ దేశం రూ.3 కోట్ల 28 లక్షల కోట్లకు సమానం అయిన 37 ట్రిలియన్ డాలర్ల రుణ భారాన్ని మోస్తోంది. వడ్డీలకే ప్రతీ సంవత్సరం దాదాపు $1 ట్రిలియన్ అంటే రూ.86 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ఆర్థిక దుస్థితి అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుందనే ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

భారత్ కూడా రుణదాతే

అమెరికా ప్రభుత్వానికి రుణాలు ఇచ్చిన దేశాల్లో భారత్ 12వ స్థానంలో ఉంది. 2023 జూన్ నాటికి భారత ప్రభుత్వం వద్ద $241.9 బిలియన్ విలువైన అమెరికా ట్రెజరీ బాండ్లు ఉన్నాయి. ఇవి దాదాపు రూ.20 లక్షల కోట్లు. అంటే మన దేశం కూడా అమెరికాకు భారీగా అప్పు ఇచ్చిన దేశాల్లో ఒకటి అన్న మాట.

వడ్డీల భారం అధికం – పన్నులే చాలు!

ప్రతి సంవత్సరం అమెరికా ప్రభుత్వం వడ్డీలకే సుమారు 25 శాతం పన్ను ఆదాయాన్ని వెచ్చిస్తోంది. ఇది సోషియల్ సెక్యూరిటీ, మెడికేర్, జాతీయ రక్షణ, మౌలిక వసతులు వంటి రంగాలకు నిధుల కొరతకు దారితీస్తోంది. దీనివల్ల ప్రజల సంక్షేమ కార్యక్రమాలు గాలికొదిలే ప్రమాదం ఉంది.

క్ర‌మంగా పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ

అమెరికా అప్పు, ఆదాయం మధ్య తేడా రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రతి సంవత్సరం సుమారు $2 ట్రిలియన్ లోటు నమోదవుతోంది. CBO (Congressional Budget Office) అంచనా ప్రకారం, ప్రస్తుతం ట్రెండ్ అలాగే కొనసాగితే **2055 నాటికి అప్పులు జీడీపీకి 156%**గా మారవచ్చని హెచ్చరించింది.

పెరుగుతున్న వడ్డీ రేట్లు – తగ్గుతున్న పెట్టుబడులు

వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో ప్రైవేట్ రంగం పెట్టుబడులు వెనక్కి తీసుకుంటోంది. వ్యాపారాలు విస్తరించలేకపోతున్నాయి. దీని ప్రభావంగా ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. 1.2 మిలియన్ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికా ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకం

అమెరికా జీడీపీ వృద్ధి రేటు 1.4% నుంచి 1.6% మాత్రమే ఉండొచ్చని అంచనా. నిరుద్యోగం పెరుగుతోంది, ద్రవ్యోల్బణం అదుపులో లేదు. ఇలాంటివన్నీ కలిస్తే రాబోయే రోజుల్లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ. ఇదే కొనసాగితే ప్రస్తుతం ఉన్న తరం, రాబోయే తరం కూడా బాద పడనివారు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి