ఏ.పీ,ఎడ్‌సెట్‌ -2025 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలో బీ.ఈడీ, కోర్సు ల్లో ప్రవేశం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వ హించిన ఏ.పీ,ఎడ్‌సెట్‌- 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు ఏపీ ఎడ్‌సెట్‌-2025 చైర్మన్, ANU ఉపకులపతి ఆచార్య కే.గంగాధర్ రావు తెలిపారు.ఈ పరీక్షకు మొత్తం 17,795 మంది దరఖాస్తు చేసుకోగా, 14,612 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన తెలిపారు.వీరిలో 14,527 మంది బీఈడీ కోర్సులో 99.42 శాతం ఉత్తీర్ణత తోపాటు,ప్రవేశం కొరకు అర్హత సాధించారని తెలిపారు.

ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్ ఆచార్య ఏవీవీఎస్ స్వామి మాట్లాడుతూ మ్యాథమెటి క్స్ మెథడాలజీ పరీక్షకు 5192 మంది దరఖాస్తు చేసుకోగా,4165 మంది హాజరయ్యారని,వీరిలో 4160 మంది అర్హత సాధించారని తెలిపారు. ఫిజికల్ సైన్స్ మెథడాలజీ లో 2050 మంది దరఖాస్తు చేసుకోగా, 1654 మంది పరీక్షకు హాజరు కాగా,1651 మంది ప్రవేశం కొరకు అర్హత సాధించారని తెలిపారు.బయలాజికల్ సైన్స్ మెథడాలజీలో 4322 మంది దరఖాస్తు చేసుకోగా,3631 మంది హాజరు కాగా 3602 మంది అర్హత సాధించారని తెలిపారు.సోషల్ స్టడీస్ మెథడాలజీకి 5418 మంది దరఖాస్తు చేసుకోగా,వీరిలో 4499 మంది పరీక్షకు హాజరు కాగా 4451 మంది ప్రవేశం కొరకు అర్హత పొందారని తెలిపారు. ఇంగ్లీష్ మెథడాలజీకి 813 మంది దరఖాస్తు చేసుకోగా,వారిలో పరీక్షకు హాజరైన 663 మంది సంపూర్ణ ఉత్తీర్ణతను సాధించారని ఆయన తెలిపారు.

ఎడ్‌సెట్‌ ఫలితాలు, ర్యాంక్ కార్డుల కోసం వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx. నుండి పొందవచ్చని తెలిపారు.ఫలితాల విడు దల కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కే.రత్న షీలా మణి, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఆచార్య తులసీదాస్, డాక్టర్ వి.సుభాషిని,డాక్టర్ కే శశిధర్ సిబ్బంది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఎడ్‌సెట్‌ ర్యాంకర్లు వీరే….
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2025లో విశేష ప్రతిభ కనబరిచి వివిధ మెథడాలజీ లలో రాష్ట్రస్థాయిలో ప్రధమ,ద్వితీయ,తృతీయ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

బయలాజికల్ సైన్సెస్ లో…
కె.వెంకట కుసుమాంజలి, ఎం.చాందిని,డి కృష్ణ లు వరుసగా మొదటి మూడు ర్యాంకులు సాధించారు.

ఇంగ్లీషులో…
పి.ప్రశాంతం,డి శ్రీహిత,వి. అఖిల.

మ్యాథమెటిక్స్ లో…
ఎం.నవీన్ కుమార్,
పి.సాయి వదన,
ఎస్.కోమలిక.

ఫిజికల్ సైన్సెస్ లో…
పి.మణికంఠ,వి.లక్ష్మీ కామేశ్వరి, ఎం.మహేశ్వరి.

సోషల్ స్టడీస్ లో… సయ్యద్ హబిబున్నిసా,
పి.జగదీశ్వరరావు, సి.హెచ్,లోకేష్ లు వరుస గా ప్రధమ,ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి