డబ్బు…డబ్బు…డబ్బు….అసలు ఈ “డబ్బు” ఎలా పుట్టుకొచ్చింది తెలుసా….!?

డబ్బు మనవద్ద ఉంటే ఆ డబ్బు ఉన్నవారు ఏమైనా చేయగలరనే నమ్మకం చాలామందికి ఉంటుంది. అవును డబ్బున్న వారు ఏదైనా చేయగలరు అనే నమ్మకం అన్ని సమయాలలో కూడ సాధ్యపడదు. మరి ఈ డబ్బు లేని సమ యంలో మన పూర్వీకులు ఎలా బ్రతికారు.మరి ఇప్పుడు చలామణి అవుతున్న డబ్బు పుట్టుక ఎప్పటిది. సమాజంలో డబ్బుకు ఎందుకు అంత ప్రాధాన్యత అసలు ఈ డబ్బు ఎలా పుట్టుకొచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం.

డబ్బు పుట్టుకకు మూలం ఈనాటిది కాదు.వేల సంవత్సరాల నాటిది అని మనం చరిత్ర ఆధారంగా అంగీకరించాల్సిన విషయం.ఇది ఆదిమకాలం వస్తు మార్పిడి వ్యవస్థల నుండి క్రమ క్రమంగా నేడు మనకు ఉన్న సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థల వరకు పరిణామం చెందుతూ వచ్చింది.పూర్వం వస్తు మార్పిడిలో ఆనాటి సమాజంలో నివసిస్తున్న ప్రజలు డబ్బు అనే దానిని ఉపయోగించకుండా నేరుగా వస్తువులు మరియు పలు సేవలను మార్పిడి చేసుకున్నారు.అప్పట్లో వారికి డబ్బుకు రూపం లేదు. కావున డబ్బు అంటే వారికి అస్సలు తెలియదు.ఈ సమాజం అభివృద్ధి చెందుతున్నకొద్దీ పశువులు,పలు రకాల ధాన్యాలు మరియు విలువైన లోహాలు అనగా (బంగారం, వెండి, రాగి) వంటి వస్తు ఆధారిత కరెన్సీలు ఉద్భవించాయి.ఈ వస్తువులు వాటి అరుదుగా,మన్నిక మరియు సులువుగా మార్చగలిగే విధానం ద్వారా అవే విలువైనవిగా పరిగణించబడ్డాయి.అలా మొదటి సారిగా నాణేలు క్రీ.పూ,560ప్రాంతంలో పురాతన లిడియా అనగా ఆధునిక టర్కీలో ముద్రించబడ్డాయి.ఈ నాణేలను విలువైన లోహాల నుండి అప్పట్లో తయారు చేశారు. ఆ నాణేల విలువకు ఓ గుర్తింపు ఇవ్వడానికి అధికారిక గుర్తులతో ముద్రించడం జరిగింది.అనంతరం క్రీ.శ,618-907 కాలంలో నాణేలకు ప్రత్యామ్నాయం గా చైనాలో అక్కడి టాంగ్ రాజవంశీకులు నాణేలకు ప్రత్యామ్నాయంగా మొదటి సారిగా కాగితపు డబ్బును అధికారికంగా ప్రవేశ పెట్టారు.అనంతరం ఇదే పద్ధతిన యూరప్ అలాగే ప్రపంచంలోని ఇతర దేశాలకు కాగితపు కరెన్సీ వ్యాపిం చింది.

అయితే మరో కోణం లో పరిశీలించి చూడగా రూపాయి పేరు వెండి నాణెల నుండి వచ్చిందని చెబుతారు.సంస్కృతంలో రూప్యకం అనగా వెండి నాణెం అనే అర్థం వస్తుంది.ఢిల్లీని క్రీ.శ,1540 నుండి1545 వరకు పాలించిన షేర్ షా సూరి ప్రవేశ పెట్టిన వెండి నాణేన్ని అప్పట్లో రూపాయి పేరుతో విడుదల చేశాడు.అయితే మన దేశంలో నాణేల తయారీ క్రీస్తు పూర్వం 600 లాలం నుంచే ఉంది.షేర్ షా ప్రవేశ పెట్టిన రూపాయి నాణెం బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.అప్పట్లో రూపాయి అంటే పదహారు అణాలుగా చెబుతారు. అంటే 64 పైసలుగా తెలుస్తోంది.అలాగే 1957లో రూపాయిని వంద నయా పైసలుగా కూడా విభజించారు.భారత్ లో మొద టిసారిగా కాగితపు నోట్లను బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్ (1770-1832),అలాగే ద జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో (1773- 1775), బెంగాల్ బ్యాంక్ (1884-1891)లు ముద్రించాయి.ఇక బ్యాంక్ ఆఫ్ బెంగాల్ నోట్లు మొదట్లో ఒకవైపు మాత్రమే ముద్రణ కలిగి ఉండేవి.ఆ తర్వాత కొన్నాళ్లకు రెండు వైపుల ముద్రించడం కూడా స్టార్ట్ చేశారు.అయితే బ్యాంకుల కు బదులు ప్రభుత్వమే ఆ కరెన్సీని 1861కాలంలో విడుదల చేయడం జరిగింది.బ్రిటీష్ ఇండియా మొట్ట మొదటి నోటును విక్టోరియా రాణి చిత్రంతో ప్రవేశ పెట్టగా దాని విలువ పది రూపాయలు.అలాగే మొట్ట మొదటి వంద రూపాయల నోటును 19వ శతాబ్దంలో ఆరంభం ఏడాదిలో విడుదల కాబడింది.ఇక భారతీయ రిజర్వు బ్యాంక్ 1935 లో ఏర్పిడగా…ఇది ఏర్పిడిన అనంతరం కరెన్సీ నోట్లు ముద్రణ స్టార్ట్ అయ్యింది. అది 1938లో విడుదల చేసిన మొట్టమొదటి నోటు విషయానికి వస్తే దాని విలువ 5 రూపాయలు.అలా… ఒక్క రూపాయి నోటును మాత్రం భారత ప్రభుత్వమే విడుదల చేసింది.

హైదరాబాద్ ప్రాంతం అప్పట్లో ఒక రాష్ట్రంగా పరిగణించబడేది.1858 కాలంలో మొఘల్ చక్రవర్తి పేరున నాణేలు విడుదలకాబడేవి.అనంతరం అసఫ్ ఝా పేరుతో హాలి సిక్కా అనే నాణేలు కూడా అప్ప ట్లో చలామణిలోకి వచ్చాయి.అయితే వీటిపై ఒక వైపు నాణెం యొక్క విలువ,మరోక ప్రక్క చార్మినార్ గుర్తులు ఉండేవి.స్వాతంత్ర్యం పొందాక మన ప్రభుత్వం 1949లో మొట్టమొదటి సారిగా రూపాయి నోటుని రూపొందించడం ఆరంభించింది.ఇక ఆ నోటులో బారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలిసారిగా ఉపయోగిస్తూ రూపాయి నోటును రూపొందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి