సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మీడియాలో ఎలా విస్తృతంగా పాపులర్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే, ఈ బంధంలో లాజిక్ కంటే లాభం ఎక్కువగా పనిచేస్తుందన్న వాస్తవాన్ని నటి ప్రియమణి సంచలనంగా వెల్లడించారు.
గతేడాది ‘భామా కలాపం 2’ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడుతూ, ఆమె ఎంతో షాకింగ్ కామెంట్ చేశారు. “పపరాజీ కల్చర్ అన్నదే ఒక ట్రాష్. సెలబ్రిటీలే డబ్బులిచ్చి ఫోటోలు తీయించుకుంటారు. ఇదంతా ఒక పీఆర్ స్ట్రాటజీ” అని బహిరంగంగా చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కాయి.
ముంబయి ఏజెన్సీ నుంచి ఛార్జ్ షీట్?
ప్రియమణి చెప్పిన వివరాల ప్రకారం, బాలీవుడ్లో ఓ ప్రముఖ పీఆర్ ఏజెన్సీ వ్యక్తి తనకు పపరాజ్జిల సేవల కోసం ఛార్జీల లిస్ట్ పంపాడట. “బాలీవుడ్ స్టార్లు ఇలా డబ్బులు చెల్లించి తమ ఫొటోలు తీయించుకుంటారని నాకు అప్పటివరకు తెలీదు. ఇదంతా చూసి నేను షాక్ అయ్యాను” అని ఆమె వెల్లడించారు.
సమంతపై పపరాజ్జి దాడి.. పాత వివాదం మళ్లీ తెరపైకి
ఇటీవల ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో స్టార్ హీరోయిన్ సమంతను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఆమె ‘Stop it guys’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి కారులో వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్ కావటంతో, ప్రియమణి గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు, “సమంత కూడా ఇదే పద్ధతిలో పబ్లిసిటీ ప్లాన్ చేసిందా?” అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పబ్లిసిటీకి నకిలీ పాపరాజీ?
ముంబయిలో ఎయిర్పోర్టులు, జిమ్లు వంటి ప్రదేశాల్లో సెలబ్రిటీలు బయటపడగానే ఫోటోగ్రాఫర్లు వందలాదిగా ఎగబడుతుంటారు. కానీ ఫొటోగ్రాఫర్లు ఎలా ముందే తెలుసుకుంటారు? రోజంతా అక్కడే బేస్ అయి కూర్చుంటారా? అనే అనుమానానికి జవాబు దొరికినట్లే అయ్యింది. ఇది పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ. సెలబ్రిటీలు, పీఆర్ ఏజెన్సీలు కలిసి పని చేస్తూ మీడియా అటెన్షన్ తెచ్చుకుంటున్నారు అని ప్రియమణి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది!
సెలబ్రిటీలు తమ ప్రైవసీకి తూట్లు పొడవుతున్నారో, లేదంటే వ్యూస్ కోసమే స్క్రిప్టెడ్ పబ్లిసిటీని తయారు చేసుకుంటున్నారో అన్న చర్చ మళ్లీ మొదలైంది. ప్రియమణి మాటలు నిజమే అయితే… ఇటీవలి సమంత ఘటనపై ఆమె నుంచి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.