ప్రపంచం మొత్తం మీదట కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, తన సేవలను ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఇటీవలే కీలక మార్పునకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించింది.వాట్సప్ యాప్ ప్రారంభం కాబడిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి ప్రకటనలు లేకుండానే ఉచితంగా తన సేవలు అందిస్తున్న ఈ సంస్థ,ప్రస్తుతం ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే,త్వరలో వాట్సప్లో ప్రకటనలు దర్శనమివ్వనున్నాయని సంస్థ తన అధికారిక బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించడం జరిగింది.
అయితే,అప్డేట్స్ మాత్రం ట్యాబ్లోనేయాడ్స్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే వాట్సప్ లోని ‘అప్డేట్స్’ట్యాబ్లో ఈ ప్రకటనలు కనిపించనున్నాయి. ప్రస్తుతం ఈ ట్యాబ్లో ఉన్న ఛానెల్స్, స్టేటస్ విభాగాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు.వాట్సప్ వెల్లడించిన వివరాల ప్రకారం,రోజూ సుమారు 150 కోట్ల మంది వినియోగదారులు ఈ అప్ డేట్స్ ట్యాబ్ను చూస్తుంటారు. కావున ఈ భారీ యూజర్ బేస్ను దృష్టిలో ఉంచుకు ని,ఛానెల్ అడ్మిన్లు,వివిధ సంస్థలు,వ్యాపారులకు తమ ఉత్పత్తుల సేవలను ప్రచారం చేసుకునేందుకు, తద్వారా వాట్సప్ ద్వారా ఎదిగేందుకు అవకాశం కల్పించాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విధంగా ఇందులో మూడు రకాల యాడ్ ఫీచర్లు అందించనున్నట్లు తెలుస్తోంది.
1ఛానెల్ సబ్స్క్రిప్షన్.
వినియోగదారులు తమకు నచ్చిన ఛానెళ్లకు నెల వారీ నగదు చెల్లించి మద్దతు తెలిపే సౌకర్యం ఉంటుంది.
2ప్రమోటెడ్ ఛానెల్.
ప్రస్తుతం ఛానెల్స్ విభాగంలో కొన్ని ట్రెండింగ్లో ఉన్నటువంటి ఛానెళ్లు కనిపిస్థాయి.ఇకపై, ఛానెల్ నిర్వహిస్తున్నవారు కొంత నగదు చెల్లించి వారిఛానెల్ వీలైనంత ఎక్కువ మందికి కనిపించేలా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు.
3 స్టేటస్లో యాడ్స్.
ఇప్పటివరకు వ్యక్తుల యొక్క వాట్సప్ స్టేటస్లు మాత్రమే మనకు కనిపించేవి.ఇకపై వ్యాపారాలకు సంబంధించిన స్టేటస్లు కూడా ఈ విభాగంలో కనిపించనున్నాయి.
ఇకపోతే వ్యక్తిగతమైన చాట్స్కు మినహాయింపు ఉంటుంది.కాకపోతే ఈ ప్రకటనలు కేవలం అప్డేట్స్ ట్యాబ్కు మాత్రమే పరిమితమవుతాయని వాట్సప్ ఇప్పటికే స్పష్టం చేసింది.ఇక వినియోగదారుల యొక్క వ్యక్తిగత చాట్స్,ఫోన్ కాల్స్,ఇతర మెసేజ్లు, వారు పెట్టుకునే ఏ స్టేటస్ లు అయినా యధావిధిగానే ఎలాంటి యాడ్స్ (ప్రకటనలు) లేకుండా కొనసాగుతాయని,ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో చాలా సురక్షితంగా ఉంటాయని హామీ కూడా ఇచ్చింది.ప్రకటనల కోసం వినియోగదారులకు చెందిన దేశం, నగరం, వారు మాట్లాడుకునే భాష వంటి పరిమిత సమాచారాన్ని మాత్రమే సేకరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తులకు చెందిన ఫోన్ నంబర్లను అడ్వర్టైజర్లకు విక్రయిం చడం లేదా వారితో పంచుకోవడం జరగదని వాట్సప్ తేల్చి చెప్పింది.ఇక ఈ కొత్త యాడ్ ఫీచర్లను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చేది వాట్సప్ ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు.