పొదిలి పర్యటనలో వైఎస్ జగన్ కు మహిళల నుండి నిరసనలు.

పొదిలి: ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను, మరి ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేకపోవడం గురించి తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు.ఆయన కేంద్రానికి వెళ్లే సమయంలో రైతులు మరియు స్థానికులు రోడ్ల వెంట బారులు తీరి ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా జనసమూహంగా ఏర్పడ్డారు.

ఈ సందర్భంలో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.జగన్ గోబ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు చేస్తుండగా జగన్ కాన్వాయ్‍పై కొందరు మహిళలు చెప్పులు విసిరారు.అమరావతి మహిళలపై సాక్షిలో అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక మహిళలు ఆందోళనకు పాల్పడ్డారు.మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్…చేస్తూ నల్ల బెలూన్లు,ప్లకార్డులతో మహిళల నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న వారిపై వైసీపీ మూకల రాళ్ల దాడి చేశారు.వైసీపీ మూకల దాడిలో ఓ కానిస్టేబుల్,అక్కడ ఉన్న మహిళలకు గాయాలయ్యాయి.”జగన్ రెడ్డి మౌనం వీడాలి..ఏపీని వీడాలి అంటూ ప్లకార్డులు” ప్రదర్శన చేశారు.అమరా వతి అమ్మలను అవమానించిన వైసీపీ షేమ్ షేమ్ జగన్.. సాక్షిని బ్యాన్ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శన జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ తో మహిళలు నిరసన తెలిపారు.సాక్షిలో అనుచిత వాఖ్యలకు గానూ ఆ ఛానల్ యాజమాన్యంగా భారతి రెడ్డి మౌనం వీడాలి అంటూ…మహిళలను కించపరిచిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్లతో పొదిలిలో నిరసనలు వెల్లువెత్తాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి