పోలీసుల అదుపులో కొమ్మినేని, జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు వేట.

అమరావతి మహిళలపై తీవ్రమైన అనుచిత వాఖ్యలు చేసిన కేసులో తుళ్ళూరు పోలీసులు సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అరె*స్ట్ చేయడం జరిగింది.అమరావతి మహిళలు తుళ్ళూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన తుళ్ళూరు పోలీసులు ఏ1గా, కృష్ణం రాజుని,ఏ2గా కొమ్మినేని శ్రీనివాసరావుని చేర్చగా ఏ3 గా డిబేట్ నిర్వహించిన సాక్షి ఛానల్ ని చేర్చారు. కొమ్మినేనిని అరె-స్ట్ చేసిన పోలీసులు ఆయనను మొదట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారని తెలుస్తుంది.అక్కడ నుండి ఆయన్ని విజయవాడ లేదా గుంటూరుకి తరలించే అవకాశం ఉంది.

ఇక అమరావతి మహిళ లపై చేసిన అనుచిత వాఖ్యలు విషయమై ముఖ్యంగా తుళ్ళూరులో రెండు రోజుల క్రితం మహి ళలు,అక్కడి రైతులు పెద్దఎత్తున నిరసనలు చేశారు.స్థానిక పోలీసులకు పిర్యాదు కాపీలను అందించారు.వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పారు.వీరు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా కొమ్మినేని శ్రీనివాసరావుని అరె*స్ట్ చేయడం జరిగింది. ఇక ఈ అనుచిత వాఖ్యలు చేసిన కృష్ణంరాజు కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.ఆయన్ని కూడా ఏ క్షణంలోనైనా అరె*స్ట్ చేసే అవకాశం ఉంది.అయితే డిబేట్ ముగిసిన అనంతరం అమరావతి రైతులు, మహిళా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రముఖులు అమరావతి పై వారు చేసిన వాఖ్యలను ఖండించారు.ఇందుకుగాను జరిగింది తప్పని తమను క్షమించాలని ఇటు కొమ్మినేని,అటు కృష్ణంరాజు ఇద్దరు కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది.

మరోప్రక్క సాక్షి కార్యా లయాల వద్ద నిరసనలు, ధర్నాలు జరిగాయి.(నేడు) సోమవారం అయితే విజయవాడలో సాక్షి కార్యాలయంపై దాడి జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ముదురుతున్న వేళ మరో విషయం ఏమంటే ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ మరియు ప్రెస్ కౌన్సిల్‌కు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సాక్షి నిర్వహించిన డిబేట్ లో అమరావతి మహిళల పై చేసిన వాఖ్యల విధానంపై ఫిర్యాదు చేశారు. ఇకపోతే మంగళగిరిలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌ పర్సన్ అయిన డాక్టర్ రాయపాటి శైలజను కలిసిన రాజధాని అమరావతి మహిళలు, తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమెవద్ద కన్నీటిపర్యంతమయ్యారు. బాధ్యులపై చర్యలకు ముసాయిదా లేఖలు సిద్ధం చేశామని,సమన్లు జారీ చేస్తామని శైలజ హామీ ఇచ్చారు.కాగా ఈ వ్యవహారం ఉద్దేశపూర్వకం గానే వారు కొనసాగించార ని ఈ విధానం ఏ మాత్రం కరెక్ట్ కాదని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు.తనను కూడా ట్రోల్ చేశారని మహిళలపై ఇలాంటి దుర్మార్గపు వాఖ్యలు చేసినవారిపై తగిన చర్యలు తప్పవని ఆమె అన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి