ఏ.ఎన్.యు;రాష్ట్రవ్యాప్తం గా వివిధ కళాశాలలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2025 ప్రవేశ పరీక్ష గురువారం సజావుగా ముగిసిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్, ఏపీ ఎడ్సెట్- 2025 కన్వీనర్ ఆచార్య ఏవీవీఎస్ స్వామి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 87 ఆన్లైన్ పరీక్షా కేంద్రాలలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు 17,795 మంది దరఖాస్తు చేసు కోగా, 14,609 మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన చెప్పారు.ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ని ఈనెల 10వ తేదీన విడుదల చేస్తామని, ఏమైనా సందేహాలు ఉంటే ఈనెల 13వ తేదీలోగా నివృత్తి చేసుకోవచ్చని ఆచార్య స్వామి తెలిపారు. ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈనెల 21వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
వర్సిటీలోని ఆన్లైన్ కేంద్రాన్ని సందర్శించి పరీక్ష జరుగు తీరును పరిశీలించి, పర్యవేక్షించారు.కన్వీనర్ ఆచార్య ఏవీవీఎస్ స్వామి తోపాటు ఆచార్య బ్రహ్మాజీరావు, ఆచార్య తులసీదాస్ తదితరులు ఉన్నారు