ఆర్మీ జవాన్ భూమి ‘కబ్జా,’ మంత్రి నారా లోకేష్ కి పిర్యాదు…!!

భారత్ ఆర్మీ “బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్”లో పనిచేస్తున్న ఓ జవాను కొద్ది రోజుల క్రితం తన కుటుంబానికి చెందిన భూమిని కొందరు అన్యాక్రాంతం చేశారని, తాను దేశ సరిహద్దులలో కాశ్మీర్ వద్ద యుద్ధ పరి స్థితులు ఉన్న కారణంగా సెలవులు ఇవ్వక పోవడం తో తన భూ సమస్యను పరిష్కరించుకునే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ తో సెల్ఫీ వీడియోలో మాట్లాడిన విషయం చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. యస్…,ఇప్పుడు ఆ సైనికుడి భూమిని మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ అధికారులను రంగంలోకి దింపి పరిశీలన చేయించి ఆ జవాన్ కి న్యాయం జరిగేలా చేశారు.తక్షణమే స్పందించి జవాన్ కు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్ కి,ఆ జవాన్, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె. శివరంలో తన భార్య తల్లి దండ్రులకు చెందిన రెండె కరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనం రేపింది.అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో కాశ్మీర్ వద్ద జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని, దానిని విచారించి తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ ను ఓ జవాన్ విజ్ఞప్తి చేశారు. సదరు వీడియోపై తక్షణ మే స్పందించిన మంత్రి నారా లోకేష్..భూ సమస్య ను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు.దీంతో అధికారులు సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు వేసి నిర్ణయించడంతో సదరు భూ సమస్య పరిష్కార మైంది.మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని తమకు అండగా నిలవడం పట్ల జవాన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి