ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్

ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ,నూజివీడు, ఒంగోలు,శ్రీకాకుళం క్యాంపస్ లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న స్పెషల్ కేటగిరి విద్యార్థుల కు మే నెల 28 నుంచి 31 వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు.క్రీడలు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ,భారత్ స్కౌట్స్, గైడ్స్ ధ్రువపత్రాలు ఉన్న విద్యార్థులకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.దరఖాస్తు సమయంలో ప్రత్యేక కేటగిరి కింద దరఖాస్తు చేయడం మరచిపోయిన విద్యార్థులు కూడా నూజివీడులో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అవకాశం కల్పించామని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి