మిస్ వరల్డ్ పోటీలలో బ్రిటీష్ సుందరి మిల్లా మాగీ ఆరోపణలపై కమిటీ

తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొన్న బ్రిటీష్ సుందరి,మిస్ ఇంగ్లాండ్, మిల్లామాగీ ఆరోపణలు మిస్ వరల్డ్ పోటీపై పలు అనుమానాలకు తావివ్వ డమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం విమర్శలు ఎదు ర్కొనే పరిస్థితి వచ్చింది. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2021 మిస్ ఇంగ్లాండ్ అయిన మిల్లా మాగీ చేసిన పలు సంచలన ఆరోపణల పై తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీని యర్ ఐపీఎస్ అధికారి అయిన శిఖా గోయల్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి,సైబ రాబాద్ డీసీపీ సాయిశ్రీలు వ్యవహ రిస్తున్నారు.మిస్ వరల్డ్ కాంటెస్టెంట్‌లను అన్ని విధాలా ప్రశ్నించి,ఈ పోటీ లు నిర్వహణ తీరుపై సమ గ్రంగా ఆరా తీసేందుకు కమిటీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

తీవ్రమైన ఆరోపణలు చేసిన మిల్లా మాగీ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నవా రు ఎవరెవరు?ఆమెతోఎవ రు కూర్చున్నారు?అన్నవివ రాలను కూడా కమిటీ సేక రించనుంది.ఆమె ఆరోపణ లలో ఎంత మేర నిజం ఉందో పరిశీలించనుంది ఈ కమిటీ.మరి ముఖ్యం గా ఆమె చెప్పినట్టుగా ఏవై నా ఇబ్బందులు ఎదుర య్యాయా? అన్న అంశంపై కమిటీ దృష్టి సారించనున్న ట్లు తెలుస్తుంది.తెలంగాణ ప్రభుత్వం మరియు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌పై మిల్లా చేసిన ఆరోపణలు తీవ్ర మైన చర్చలకు దారి తీసిన నేపథ్యంలో ఈ విచారణకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రపంచ సుందరి పోటీ లను వ్యతిరేకించేవారు ఎందరో…మిల్లా మాగీ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది అని,ని*ప్పులేని దే…పొగ వచ్చే అవకాశం లేదని,అసలు మిల్లా మాగీ మాటలను ప్రభుత్వం సీరి యస్ గా తీసుకుని నిజా నిజాలు తేల్చేందుకు కమిటీ అనేది వేయడం తప్పకుండా ఆహ్వానించ దగిన విషయంగా పలువు రు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.అలాగే మిల్లా మాగీ ఆరోపణలను పూర్తిస్థాయిలో కమిటీ విచారణ జరపాలని కోరు కుంటున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి