ఐపీఎల్ క్రికెట్ రిటైర్మెంట్ పై ఎం.ఎస్.ధోనీ బిగ్ ట్విస్ట్.

కొత్త తరం క్రికెటర్లలో భారత్ యువత గుర్తించు కోదగిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు.వీరిలో ప్రధానంగా భారత దేశానికి 2011వ సంవత్సరం వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ జట్టు కు కెప్టెన్ మిస్టర్ కూల్ మహీందర్ సింగ్ ధోనీ అంటే తెలియని క్రికెట్ అభిమానులు ఉండరని చెప్పవచ్చు.ఇక ఎన్నో క్రికె ట్ సిరీస్ లతో పాటు 2007లో ప్రారంభం అయి న టి-20 మొదటి వరల్డ్ కప్ ని కూడా మన దేశానికి అందించిన వ్యక్తి, ఆనాటి కెప్టెన్ మన ఎం. ఎస్.ధోనీ.ఇక ఇతగాడు గ్రౌండులో ఉన్నాడు అంటే ఎటువంటి మ్యాచ్ నైనా కూల్ గా ఉండి టీమ్ ని గెలిపించి తీరతాడని ఎందరో భారత్ క్రికెట్ క్రీడాభిమానుల నమ్మకం. మరి అటువంటి ధోనీ 2020లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యా రు.కానీ ఎంఎస్ ధోని ఐపీ ఎల్ కి మాత్రం కొనసాగు తూనే వున్నారు. ఆయన అభిమానులు, చాలా మంది క్రికెట్ క్రీడా కారులు అనుకున్నట్లు ఆయన రిటైర్మెంట్ ప్రకటన చేయలేదు.

పైగా తాను ఆడిన ఐపీఎల్ మ్యాచ్ గురించి హుషారుగా మాట్లాడారు ధోనీ.తనకు గుజరాత్ టైటాన్స్ పై చాలా అద్భుత మైన విజయం దక్కిందని అన్నారు.అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీ పలు ఆసక్తిక ర వ్యాఖ్యలు కూడా చేశా డు.తన ఐపీ ఎల్ క్రికెట్ రిటైర్మెంట్ గురిం చి జరుగు తున్న అతిపెద్ద ప్రచారంపై చాలా కూల్ గా స్పందించాడు ధోనీ.ఆతను తన ఐపీఎల్ క్రికెట్ భవిష్య త్తుపై ఏ విధమైన స్పష్టత ఇవ్వక పోవడంతో ఆయన మరోసారి మిస్టర్ కూల్అని పించారు.ఈ క్రమంలో ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవు తున్నారని వార్తలు వినిపి స్తున్నాయి.ఈ క్రమం లో ఆ వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని కూల్, కూల్ గా స్పందించాడు. రిటైర్మెంట్ విషయంలో తనకు ఏ విధమైన తొందర లేదని..అన్నారు.

నేను భవిష్యత్ ఆట గురిం చి నిర్ణయం తీసుకోవడాని కి నాకు మరికొంత టైం ఉందని అంత తొందరగా క్రికెట్ వడలాలని లేదని అన్నారు.మరి ముఖ్యంగా నా శరీరాన్ని మరింత ఫిట్‌ గా ఉంచుకోవాలని,అలా ఉండగలిగితేనే మరింత అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం ఉందని అన్నారట…!ఒక వేళ ఆటగాళ్లు తమ ప్రద ర్శన సరిగా లేదని అనుకు ని రిటైర్ అవ్వడం మొద లుపెడితే, కొందరు క్రికెటర్లు 22 ఏళ్లకే రిటైర్ అవ్వాల్సి వస్తుంది అన్నారు.ప్రస్తు తానికి నేను రాంచీకి వెళ్లి, అక్కడ ముందుగా నా బైక్‌ లతో కొన్ని రైడ్స్ ని ఎంజా య్ చేస్తానని తెలిపారని సమాచారం.అయితే ఐపీ ఎల్ క్రికెట్ ని పూర్తిగా వది లేస్తున్నానని చెప్పడం లే దు,అలాఅని,మళ్ళీ వస్తా నని కూడా నేను చెప్పడం లేదు అన్నారు.నిర్ణయం తీసుకోవడానికి నాకు తగి నంతసమయంఇంకాఉంది ప్రశాంతంగా ఆలోచించి,ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తాననేసమాధానం ధోనీ నుండి వచ్చింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి