నేను మారను,నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.నువ్వే పదవి వచ్చాక మారిపోయావు!
మూడు దశాబ్దాలుగా రాజ శేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది.పెళ్ళి చేసుకున్న వారే విడిపోతు న్నారు,మాది రాజకీయ బంధం,ఇందులో ఆశ్చర్యం ఏముంది?ప్రలోభాలకు లొంగను,ఎవ్వరికీ భయ పడను,విశ్వసనీయత కోల్పోయే తత్వం కాదు.మద్యం కేసు సిట్ చూస్తోం ది. కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. భవిష్యత్ లో ఇంకా వివ రాలు చెప్పాల్సి వస్తే చెబు తానేమో!
భక్తి ఇప్పుడూ ఉంది అప్పుడూ ఉంది.కాకపోతే గతంలో మా నాయకుడి మీద ఉండేది.ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉంది.ఆయనకు ఇంకా నాగురించి ఏమి తెలి యదు.నేను ఎవ్వరి ప్రలోభాలకు లొంగే రకం కాదు.ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను.ఎన్నో బాధలు పడ్డాను.అయినా అక్కడ ఉంటే నా బాధలు తగ్గవని అర్ధమైంది.అందు లోంచి తప్పుకున్నాను. ప్రశాంతంగా హాయిగా వున్నాను.
(వై.ఎస్.జగన్ ప్రెస్ మీట్ పై స్పందించిన విజయ సాయి రెడ్డి)