ఢిల్లీ నుండి మీడియాతో మొదటిరోజు సీ.ఎం,చంద్రబాబు

ఢిల్లీ: 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడారు.వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రా న్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందని,మా ప్రభుత్వం రాగానే రాష్ట్రా న్నిపునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం అని తెలిపారు.రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంత వరకు ఎప్పుడూ చూడనటువంటి విధ్వంసం గత ఐదేళ్లలో జరిగిందని,గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లు లు చెల్లించకుండా బకాయి లు పెట్టింది.వైసీపీ చేసిన విధ్వంసానికి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని,ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రజలు మాకు విజయం కట్టబెట్టారనిఅన్నారు.ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్య ధికంగా పెట్టుబడులు వచ్చాయని,ఢిల్లీకి వచ్చిన ప్రతీసారి ఏడుగురు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు ఆయన అన్నారు.మాప్రభు త్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొ చ్చింది.ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి.అలాగే రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని ప్రహ్లాద్ జోషిని కోరడం జరిగిందని బాబు అన్నారు.

గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించా రని,సూర్యఘర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించాం.సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గం లో 10 వేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం.సూర్య ఘ ర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం కుసుమ్ కింద 2 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారబోతుంది.గ్రీన్ ఎనర్జీ ద్వారా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేసేందు కు వీలవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.ఆప రేషన్ సిందూర్‌ను విజయ వంతం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు అభినందనలు తెలిపానని మీడియాతో అన్నారు. జగ్గయ్యపేట- డోలకొండ క్లస్టర్‌లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉంది. జగ్గయ్యపేట-డోల కొండ క్లస్టర్‌ను మిస్సెల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరాం. లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్ ,ఎలక్ట్రానికి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరాం.విశాఖ- అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్ ఎక్స్‌పరిమెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరి నట్లు చెప్పారు. కర్నూలు- ఓర్వకల్లు క్లస్టర్‌లో మిలిట రీ డ్రోన్లు, రొబోటిక్స్, అడ్వా న్స్ డిఫెన్స్ కాంపోనెట్స్ తయారీ చేయాలని కోరాం. – తిరుపతి ఐఐటీలో డీఆర్డీ వో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పెట్టాలని అడిగినట్లు తెలి పారు.మా ప్రతిపాదనలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించా రని,రాష్ట్రంలో సైనిక కంటో న్మెంట్ పెట్టాలని కోరగా దానికి ఆయన సానుకూ లంగా స్పందించారు.మరి యు జలశక్తి మంత్రిసి.ఆర్. పాటిల్‌తో పోలవరంపై చర్చించానాని పోలవరాన్ని 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళిక ఉంది,ఎంత త్వర గా వీలైతే..అంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు.

పోలవరం నిర్మాణం నాణ్యతలో రాజీపడం తో – రూ.400 కోట్ల తో నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం దెబ్బతీసింది.గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గా మళ్లీ 980 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నాం అన్నారు.పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుంది. పోలవరం-బనకచర్ల ప్రాజె క్టు ద్వారా 200 టీఎంసీల నీటిని దారి మళ్లించవచ్చు. పోలవరం-బనకచర్ల ప్రాజె క్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజె క్టు ద్వారా తరలిస్తాం. కేంద్రం అనుమతి ఇవ్వగా నే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రారంభిస్తాం – శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. శాంతిభద్ర తల కోసం కేంద్రహోంమంత్రి కొన్ని సూచనలు ఇచ్చారు – అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరాం.. సానుకూలంగా స్పందించా రు.ఆర్డీటీ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాం.పూర్వో దయ పథకం మరికొన్ని నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్‌ను కోరాను.పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థికం గా సహకరించాలనినిర్మలా సీతారామన్‌ను కోరాం.మా ప్రతిపాదనలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్ సానుకూలంగా స్పందిం చారు.సంక్షేమాన్ని కొనసాగి స్తూనే అభివృద్ధి చేస్తున్నాం – సంపద సృష్టించాలంటే ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకురావాలి.కేంద్రం నుంచి ఆర్థికసాయమే కాదు.. అనుకూలమైన ప్రతిపాదనలు కావాలి అని ఏ.పీ,సీఎం చంద్రబాబు ఈ విషయాలన్నీ మీడియాకు వివరించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి