రూ.25/-తో యువతకు దేశాన్ని చుట్టేసే ‘టూర్.’

25 రూపాయలతో ఇప్పుడు దేశం మొత్తం చుట్టి వచ్చే అవకాశం కల్పిస్తుంది మన ఇండియన్ రైల్వే. రూ. 25 రూపాయలతో దేశం మొత్తం చుట్టేసి రావడంపై యువత చాలామంది చాలా ఆశక్తిని కనబరుస్తున్నారు.దేశంలో తాము చూడాలనుకున్న, తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లాలన్నా, జీవితం ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు కొందరు యువత. కానీ ఈ సరదా తీర్చుకోవడానికి అందరి చేతిలో తగిన నగదు వారివద్ద ఉండదు. డబ్బులు లేక చాలామంది.. సమయం లేక మరి కొంతమంది అలా వెళ్ళి ఎంజాయ్ చేయలేక బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం తాజా గా ఓ మంచి అవకాశం వచ్చింది. కేవలం ఒక పాతిక (రూ. 25)తోనే దేశం మొత్తం రైలులో ప్రయాణించవచ్చు.ఏమిటీ ఆశ్చర్యంగా ఉందా… అయితే ఈ వివరాలు చూడండి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమాన్ని “జాగృతి యాత్ర” అని అంటారు.ఈ కార్యక్రమం ద్వారా యువత కేవలం రూ.25 తోనే దేశం మొత్తం ప్రయాణించే అవకాశం లభిస్తుంది.జాగృతి యాత్ర అనే ఈ ప్రత్యేకమైన రైలు ప్రయాణం ద్వారా దేశ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది రైల్వే శాఖ. దీనికోసం https://www.jagritiyatra.com/ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి.దరఖాస్తుకు చివరి తేదీ విషయానికి వస్తే,ఈ ఏడాదికి అక్టోబర్ 15గా ఉంది.

ఇక ఈ “జాగృతి యాత్ర” పేరుతో నడిచే ఈ రైలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. దీంట్లో ప్రయాణించేందుకు 500 మంది యువతకు మాత్రమే అనుమతి ఉంటుంది.ఈ ప్రయాణం లో యువతకు పలు నైపుణ్యాలు,పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన మెళకువలు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విహారంతో పాటు యువతకు విజ్ఞానాన్ని కూడా అందిస్తారు.యువతలో జ్ఞానం-విజ్ఞానం పెంపొందించడంలో ఈ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.ఈ “జాగృతి యాత్ర”లో భాగంగా కేవలం 15 రోజుల్లో ఈ రైలు సుమారు 8వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

  ఇక ఈ "జాగృతి యాత్ర" రైలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభం అవుతుంది..అలా అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు ప్రాంతాల మీదుగా ప్రయాణించి మధురైకి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఈ రైలు  ఒడిషా.. ఆ తర్వాత మధ్య భారతదేశం గుండా ప్రయాణించి మళ్లీ దిల్లీకి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో పలు తీర్థ యాత్ర స్థలాలతోపాటు, పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.

అయితే ఈ “జాగృతి యాత్ర” ప్రతీ సంవత్సరం నవంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది.ఈ యాత్రలో పాల్గొనాలనుకునే యువత ముందుగా సంబంధిత వెబ్ సైట్ లో వారి వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ విషయం ఏంటంటే,ఈ రైలులో ప్రయాణించడానికి యువత వయసు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలనేది ఓ నిబంధనగా సమాచారం. ఇక ఈ ఏడాది జాగృతి యాత్ర నవంబర్ 7న ప్రారంభం కానుంది. నవంబర్ 22న ముగియనుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి