వైలెన్స్తో కూడా ఒక కథ చెప్పొచ్చని మరోసారి నిరూపించబోతున్నాడు యంగ్ హీరో నితిన్. ‘వకీల్ సాబ్’ వంటి భావోద్వేగ చిత్రాన్ని అందించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’ ట్రైలర్, బుధవారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తే ఒక్క మాటలో చెప్పాలంటే… ఇది కచ్చితంగా కంట తడి పెట్టించే సినిమా అనిపిస్తుంది.
“మీ అక్కను చూశావా..? చనిపోవడానికి రెడీగా ఉంది.. కానీ క్యారెక్టర్ను మాత్రం లూజ్ చేయలేదు” అనే డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుందంటే, సినిమా ఎమోషనల్ ఇంటెన్సిటీ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది. ఆ వెంటనే నితిన్ చెప్పే మరో డైలాగ్ — “చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది… ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది” — ట్రైలర్కు హార్ట్బీట్లా నిలుస్తుంది.
ఈ చిత్రంలో నితిన్ అక్క పాత్రలో లయ కనిపించగా, హీరోయిన్లుగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కనిపించనున్నారు. అక్క తమ్ముడి బంధాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ కథ, ఒక తమ్ముడు తన అక్క గౌరవాన్ని కాపాడేందుకు చేసే పోరాటాన్ని హృద్యంగా చూపించనుంది.
సినిమాను దిల్ రాజు, శిరీష్ లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక నేపథ్య సంగీతం విషయానికి వస్తే, ‘కాంతారా’ చిత్రానికి ప్రాణం పోసిన సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ స్వరాలు ఈ చిత్రానికి మరో డైమెన్షన్ను జోడించబోతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
జూలై 4న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం, భావోద్వేగం, ఆక్రోశం, కుటుంబ విలువల మేళవింపుతో నితిన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుంది. ట్రైలర్ మాత్రం ఒకే సందేశం చెప్తోంది –
ఇది ప్రేమతో చెప్పే కథ కాదు.. ఇది గౌరవాన్ని కాపాడే పోరాటం!
ఇక అభిమానుల నిరీక్షణ మొదలైంది… తమ్ముడు థియేటర్లను తాకే దాకా హైపే హైప్!