ఆకాశంలో విమానాలను పక్షులు’ఢీ’ కొంటే ఏమవుతుంది…!?

భూమి నుండి ఆకాశంలోకి వేలాది అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే విమానాని కి పక్షులు తగిలితే ఏమవుతుంది అనే అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ అనుమానాలు రావడానికి కూడా మనం అప్పుడప్పుడు వింటాం కదా…!”ఆకాశంలో విమానాన్ని డీ కొన్న పక్షి, విమానానికి తప్పిన ప్ర*మాదం”.ఇది కొంచెం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.విమానాన్ని పక్షి డీ కొడితే,పక్షికే ప్రమాదం కదా…!విమానానికి ఏంటి సమస్య అని పిల్లలైతే చాలా తీవ్రంగా ఆలోచించి జుట్టు పీకేసుకుంటారు. అయినా,ఇది వారికే కాదు కొంతమంది పెద్దవారికి సమాధానం లేని ప్రశ్నగా ఉంటుంది.ఇప్పుడు మనం ఇదే అంశంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. మరి ఆ తెలుసుకున్న విషయాలు కూడా మన పిల్లలకు చెబుదాం.

ఒక ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి..అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలెట్. ఇది సోమవారం నాటి వార్త…,పాట్నా నుండి సోమవారం రాంచీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని దాదాపు 4,000 అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న విమానాన్ని ఉన్నపళంగా ఆకాశంలో రాబందు ఒకటి ఢీకొట్టింది.అయితే రాంచీ విమాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసర పరిస్థితిలో ల్యాండింగ్ చేశాడు ఆ విమానం పైలెట్.ఈ ఘటన జరిగిన సమయంలో ఆ విమానం లో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నారనేది ఒక సమాచారం.అయితే ఈ ఘటనతో అందరూ సురక్షితంగా ఉన్నారని రాంచీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.

అయితే ఇక్కడ అసలు సమస్య విషయానికి వస్తే పక్షులు అనేవి ఆకాశంలో గుంపులుగా వచ్చినా, ఒక్కొక్కటిగా వచ్చి విమానానికి ఢీకొన్నా వివిమానం ఉన్నపళంగా కూలిపోయే ప్రమాదం లేకపోలేదనేది ఓ సమాచారం.అందుకే పక్షుల కంటే ఎత్తైనఆకాశమార్గం లో విమానాలను నడుపుతుంటారు వాటి పైలెట్లు. ఒక అనుకోని వేళ తక్కువ ఎత్తులో విమానం వెళితే, ఆ సమయంలో పక్షి వచ్చి విమానాన్ని ఢీకొడితే ఆ పరిస్థితి పైలట్ సామర్థాన్ని,విమానం ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందట.అలా గే ఫ్యూయల్ (ఆయిల్) ట్యాంకును పక్షులు ఢీ కొట్టి నా దానిలో చమురు లీక్ అవడం,వెంటనే మంటలు చెలరేగడం వంటివి జరుగుతాయి.ఒకవేళ విమానం యొక్క ఇంజిన్ భాగాన్ని ఏవైనా పక్షులు తాకితే దానిలోపల ఉన్న బ్లేడ్స్ అలాగే ఆ విమానం ఎలక్ట్రానిక్ సిస్టం దెబ్బతింటాయి. ఈ పరిస్థితిలో విమానం పైకి ఎగిరే సామర్థ్యాన్ని వెంటనే తగ్గించడంవల్ల కుప్పకూలవచ్చట.అందు కే ఈ మధ్య కాలంలో పక్షులు విమానాలను ఢీకొట్టినా ఏమీ కాకుండా వాటిని మరింత బలమైనదిగా నిర్మిస్తున్నారు.అయినా జాగ్రత్త అనేది అవసరం అని అంటున్నారు నిపుణులు.అలాగే పక్షులు విమానాలను గానీ,విమానాలు పక్షులను గానీ ఢీ కొట్టినప్పుడు విమానం ఇంజిన్‌ లో ఏదైనా చిన్నపాటి సమస్య ఉన్నా.. అది మరింత పెద్దదిగా అవుతుంది.ఇక ఫ్యూయల్ ట్యాంక్‌ను లేదా దాని పైపును పక్షి తాకితే విమానంలోని ఇంధనం వెంటనే బయటకు వచ్చేస్తుంది.ఆ సమయంలో ఒకవేళ ఎండగా ఉంటే,వాతావరణం వేడిగా ఉన్నా వెంటనే మంటలు చెలరేగుతాయి. విమానం కాలిపోయి విమానంలోని ప్రయాణికు లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి